Wednesday, May 15, 2024
- Advertisement -

తనికెళ్ళ భరణి భక్త కన్నప్ప సినిమాకి అడ్డం పడింది ఎవరు ?

- Advertisement -

కొన్ని ప్రాజెక్ట్ లు చాలా క్రేజీ గా వినపడతాయి. ఆ డైరెక్టర్ ఈ హీరో తో ఆ కథ ని తీస్తారు అని చెబితేనే ప్రేక్షకులు ఎక్జిట్ అవుతారు. భలే కాంబినేషన్ సెట్ అయ్యిందే అనుకుంటూ డిస్ట్రిబ్యూటర్ లు కూడా సిద్దం అయిపోతారు. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా చెప్పాలి భక్త కన్నప్ప ప్రాజెక్ట్. తనికెళ్ళ భరణి – హీరో సునీల్ తో మొదట తీద్దాం అనుకున్నారు గానీ తరవాత మంచు విష్ణు తో తీయాలని డిసైడ్ అయ్యారు.

మొదట 25 కోట్ల బడ్జెట్ తేలుతోంది అని సునీల్ ని పక్కన పెట్టేసారు. భక్త కన్నప్పను ఇంటర్నేషనల్ ఫిలిమ్ రేంజ్ లో తీసేందుకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో చర్చలు కూడా జరిగాయి. అంతా అయ్యాక లెక్కలు చూస్తే బడ్జెట్ 50 కోట్లకు చేరుకుందిట. దీంతో ఇంత భారీగా ఖర్చుపెట్టి కన్నప్పను తెరకెక్కించడం అవసరమా అనే ఆలోచనకు వచ్చాడట విష్ణు.

సో ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దగ్గర ఆగిపోయింది అంటున్నారు. ఇది కాకుండా రావణ బ్రహ్మ అనే పాత్రతో మోహన్ బాబు ని చూపిస్తూ సినిమా తీయాలని అనుకున్నాడు విష్ణు అది కూడా బడ్జెట్ కారణంగా ఆగిపోయింది అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -