భూమిక తెలుగులో అగ్ర హీరోలందరితో నటించింది. చిరంజీవి, వెంకటేష్,నాగర్జున,పవన్ మహేష్ బాబు,ఎన్టీఆర్, ఇలా అందరితో నటించింది.ఇద్దరు హీరోలకు మాత్రం కెరీర్లో బెస్ట్ హిట్లను అందించింది ఈ భామ. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ అలాగే మహేష్తో నటించిన ఒక్కడు సినిమాలు వాళ్ల కెరీర్ లోనే కాక ఇండస్ట్రీ హిట్స్గా నిలిచియి.అయితే ఈ రెండు సినిమాలు వాళ్లకు 7వ చిత్రాలు కావడం మరో విశేషం.
ఇదిలా ఉంటే.. ఇటీవల ‘ఎం.సి.ఎ’ చిత్రంలో నానికి వదినగా కనిపించి మంచి మార్కులు కొట్టేసిన భూమిక.. తాజాగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా పవన్, మహేష్ గురించి అడగ్గా పవన్ చాలా సెన్సిటివ్ అని.. మహేష్ జోవియల్గా ఉంటారని చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చేప్పింది ఈ భామ.’ఎం.సి.ఎస సినిమాతో భూమికకు అవకాశాలు పెరిగాయి.భూమిక ప్రస్తుతం నాగచైతన్య పక్కన అక్కగా నటిస్తుంది.