Saturday, May 18, 2024
- Advertisement -

కౌషల్ పై కక్షను వెళ్లగక్కేసింది…

- Advertisement -

దీప్తి సునయన…బిగ్ బాస్ హౌస్ లో ఓ బాడీ గార్డ్ ని ఏర్పాటు చేసుకుంది. ఆ బాడీ గార్డ్ గ్రూపు ద్వారా ఎలిమినేషన్ జోన్ లోకి పోకుండా నామినేట్ కాకుండా సేఫ్ గేమ్ ఆడుతోంది. దీప్తి సునయన చిన్నపిల్ల అనుకున్నాను. అందుకే పిట్ట అని పేరు పెట్టాను. కానీ మహా ముదురు. పిట్ట కాదు పిడుగు అని భానుశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె ఎందుకు చెప్పిందో అప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులకు తాజా ఎపిసోడ్ తో ఓ క్లారిటీ వచ్చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత‌సేపూ ఎవ‌రో ఒక‌రిపై ఆధార‌ప‌డుతూ.. నెట్టుకొచ్చేసే స్వ‌భావం ఆమెది. అయినా.. సున‌ైనా అంద‌రూ అనుకున్నంత చిన్న‌పిల్ల‌యితే కాద‌ని, సేఫ్ గేమ్ ఆడటంలో ముదురు..హోస్ట్ నాని చెప్పినది నూటికి నూరు శాతం నిజం. సోమవారం ఎపిసోడ్ లో నంబర్ గేమ్ సందర్భంగా కౌశ‌ల్ విష‌యంలో దీప్తి న‌ల్ల‌మోతు చేసిన ఓవర్ యాక్టింగ్ పై కోట్లమంది బిగ్‌బాస్ ప్రేక్ష‌కులు మండిపడుతున్నారు. అయితే దీప్తి న‌ల్ల‌మోతు వ‌చ్చి.. నేను ఏమైనా త‌ప్పు చేశానేమో అనే భయం ఉంది. కౌషల్ తో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదేమో. నంబర్ గేమ్ వద్ద నా ప్రవర్తన చూసి బయట ప్రేకక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని భ‌యంగా ఉంది అని దీప్తి నల్లమోతు చెప్పుకొచ్చింది. ఈమాట ఆమె అన్నప్పుడు దీప్తి సున‌య‌న త‌న కుళ్లును బ‌య‌ట‌పెట్టింది. ఈ సందర్భంగా సున‌ైనా మాట్లాడిన మాట‌లు వింటే.. అమ్మో ఈ పిల్ల ఇంత క‌న్నింగా అని అనుకోవడం సహజమే. ఏయ్ లైట్ తీస్కో.. కౌషల్ విష‌యంలో నువ్వు చేసిన‌ది క‌రెక్టే. వ‌న్ ప‌ర్సంటేజీ కూడా ఫీల‌వ్వాల్సిన, భయపడాల్సిన ప‌నిలేదంటూ.. మ‌హా ముదురులా తీసి పారేసింది. ఆ సందర్భంలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ పెట్టి చెప్ప‌డం చూస్తే.. దీప్తి సున‌ైనా అంద‌రి ద‌గ్గ‌రా ఎంత న‌టిస్తోందో తెలిసిపోయింది. నిజానికి చిన్న‌పిల్ల‌లు ఎవ‌రూ ఇంత క‌న్నింగ్‌గా.. అవ‌త‌లి వ్య‌క్తికి చేసిన ద్రోహం విష‌యంలో లైట్ తీసుకోమ‌ని స‌ల‌హా ఇవ్వ‌రు..

ఇవ్వ‌లేరు కూడా. కానీ ఇదీ.. దీప్తి సున‌య‌న‌ అసలైన నిజ‌స్వ‌రూపం. వాస్తవానికి దీప్తి సున‌య‌నను హౌస్‌లో ఉండేవారు అనుకున్నంత అమాయ‌కురాలు కాదు.. కదా మ‌హా ముదురు. ఎందుకంటే.. హౌస్‌లో గ్రూపుల‌కు బీజం వేసిందే దీప్తి సునైనాయే. ఏంటీ.. న‌మ్మ‌బుద్ధి క‌ల‌గ‌డం లేదా.. అయితే.. బిగ్‌బాస్ హౌస్‌లోంచి మొద‌టి వారంలోనే ఎలిమినేట్ అయిన‌.. సంజ‌న చెప్పిన ఓ నిజం మీకు తెలిస్తే కచ్చితంగా నమ్మి తీరుతారు. దీప్తి సున‌య‌న క‌నిపించేంత అమాకరాలేం కాదు. చాలా తెలివైన‌ది. హౌస్‌లో మొద‌టి వారం.. నేను, త‌ను, రోల్‌రైడా, భానుశ్రీ క‌లిసి ఉండేవాళ్లం. అప్పుడు ఓసారి సున‌య‌న చెప్పిన మాట నాకు ఇప్ప‌టికీ.. ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. మ‌న న‌లుగురం ఇలాగే క‌లిసి ఉంటే.. మ‌న‌ల్ని ఎవ‌రూ నామినేట్ చేయ‌రు. మ‌నం మిగ‌తా వాళ్ల‌ని ఎంచుకుని నామినేట్ చేసేద్దాం..అని చెప్పిందని సంజన ఓ ఇంటర్వ్యూలో తెపిలింది. గ్రూపులు కట్టడం వల్ల మ‌నం హౌస్‌లో సేఫ్‌గా ఉండొచ్చంటూ దీప్తి సున‌య‌న చెప్పిందంటూ సంజ‌న బ‌య‌ట‌పెట్టింది. అమ్మో.. ఆమెను చూస్తే.. అలా క‌నిపించ‌దు కానీ.. లోప‌ల చాలా ఉందంటూ సంజ‌న బాంబు పేల్చింది. షో అదీ అస‌లు సంగతి.

తేజ‌స్వి గ్రూప్ కట్టకముందే…. దీప్తి సున‌య‌న ఆ ముఠా సంస్కృతిని ప్రారంభించింది. అయితే.. సంజ‌న బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం. భానుశ్రీ గీతామాధురి, శ్యామ‌ల‌తో క్లోజ్‌గా ఉండ‌డం.. రోల్‌రైడా త‌ట‌స్థంగా ఉండ‌డంతో దీప్తి సున‌య‌న ప్లాన్ చేంజ్ చేసింది. వీళ్ల‌తో సేఫ్ కాదని, అప్ప‌టికే గ్రూప్‌గా ఫామైన తేజ‌స్వ టీంలో కీల‌క‌మైన స‌భ్యుడు త‌నీష్ కి ద‌గ్గ‌రైంది. రోజంతా అత‌ని వెంటే ఉంటూ.. అత‌నెక్కుడుంటే.. అక్క‌డికి వెళ్లిపోతుంద‌ని.. భానుశ్రీ కూడా హౌస్‌లో ఒక‌సారి గీతామాధురి, శ్యామ‌ల త‌దిత‌రుల‌కు అన‌డం మనం చూసింది. కౌషల్ కెప్టెన్ గా ఉన్నప్పుడూ రాత్రి 2 గంటల సమయంలో దీప్తి బెడ్ మీద లేదు. నా కెప్టెన్సీలో ఇలాంటివి చూస్తూ ఉండలేని అని అన్నాడు. నేను వాష్ రూమ్ కి వెళ్లానేమో…కదా అంటూ దీప్తి సునైనా అతడిపై మండిపడింది. మొత్తానికి త‌నీష్‌కు ద‌గ్గ‌రై.. తేజ‌స్వి, సామ్రాట్ మ‌ద్ద‌తు.. వారి ద్వారా.. అమిత్‌, బాబూ గోగినేని, గ‌ణేష్‌, రోల్‌రైడా అంద‌రికీ ద‌గ్గ‌రైపోయింది. అలా.. ఇప్ప‌టివ‌ర‌కూ అదే సేఫ్ జోన్‌లో నెట్టుకొచ్చేస్తోంది. కానీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇలాంటి క‌న్నింగ్ ప్లాన్లు ఎన్ని చేసినా.. అది కొంత‌వ‌ర‌కే.. ఎవ‌రికి వారుగా నిరూపించుకుంటేనే ఉండ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఈ విష‌యంలో స‌డెన్‌గా.. వ‌చ్చే వార‌మే.. దీప్తి సున‌య‌న వెళ్లిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ప్రేక్షకులు అన్నీ గమనిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -