Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్‌బాస్: కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు కౌశ‌ల్ ఏం చేశాడో తెలుసా?

- Advertisement -

భారీ వ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ రాష్ట్రం స‌ర్వ‌స్వం కోల్పోయిన సంగ‌తి తెలిసింది.20 రోజులు కురిసిన భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ‌లోని 42 న‌దులు ఒకేసారి పొంగి పొర్లాయి.దీంతో కేర‌ళ‌లోని 4 జిల్లాలు పూర్తి దెబ్బ‌తిన్నాయి. దాదాపు రెండు ల‌క్ష‌ల మంది త‌మ ఇళ్ల‌ను వ‌దిలి ప్ర‌భుత్వ ఏర్పాటు చేసిన గృహాల‌లో త‌ల దాచుకున్నారు.కేర‌ళ య‌థాస్థితికి రావ‌డానికి మ‌రో 10 ఏళ్లు ప‌డుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు నుంచి కేర‌ళ‌కు ఆర్థిక సాయం అందుతున్న సంగ‌తి తెలిసిందే.ఇక ఇప్ప‌టీకే తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌,క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన ప్రముఖులు కేర‌ళ‌కు విరాళాలు ప్ర‌క‌టించారు.

తాజాగా తెలుగు రియాల్టీ షో అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన కౌశ‌ల్ కూడా కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది.గ‌త‌వారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన న్యాచుర‌ల్ స్టార్ నాని కేర‌ళ వ‌ర‌ద‌లు గురించి హౌస్‌మెట్స్‌తో చ‌ర్చించారు.కేర‌ళ‌కు మ‌న‌వాళ్లు అందిస్తున్న ఆర్థిక సాయం గురించి చెప్పుకొచ్చాడు నాని.ఈ వార్త విన్న కౌశ‌ల్ తాను క‌నుక బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ అయితే ఆ ప్రైజ్ మ‌నీ మొత్తం కేర‌ళ‌కు విరాళంగా ప్ర‌క‌టిస్తాన‌ని నానితో చెప్ప‌డ‌ట కౌశ‌ల్‌.ఒక‌వేళ విన్న‌ర్ కాక‌పోయిన త‌న‌కు తోచిన సాయం చేస్తాన‌ని మాట ఇచ్చాడట కౌశ‌ల్‌.బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కౌశ‌ల్ విన్న‌ర్ అవుతాడ‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆశిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -