Monday, May 13, 2024
- Advertisement -

కౌశ‌ల్‌ను రిక్వెస్ట్ చేసిన‌ సామ్రాట్‌

- Advertisement -

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య మొద‌లైన బిగ్‌బాస్ రెండో సీజ‌న్ గ‌త ఆదివారంతో ముగిసింది.118 రోజుల పాటు సాగిన తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ అద్యాంతం వివాదాల‌తోనే సాగింది.16 మంది కంటెస్టెంట్ల‌తో మొద‌లైన రెండో సీజ‌న్‌లో విన్న‌ర్‌గా కౌశ‌ల్ నిలిచిన సంగ‌తి తెలిసిందే.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తం కౌశ‌ల్ చూట్టునే న‌డించింది.అత‌ను విన్న‌ర్‌గా నిల‌వ‌డంతో బ‌యట‌ ఉన్న కౌశ‌ల్ ఆర్మీ పాత్ర మ‌ర‌వ‌లేనిది.ఆడ‌వాళ్లు మ‌గ‌వాళ్లు అని చూడ‌కుండా కౌశ‌ల్‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ వారంద‌రిని విప‌రీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఈ కౌశ‌ల్ ఆర్మీ.

వీరికి భ‌య‌ప‌డి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోష‌ల్ మీడియాకి రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.తాజాగా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొన్నాడు సామ్రాట్‌.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌ ఫైన‌లిస్ట్ అయిన సామ్రాట్ త‌న ఫేస్ లైవ్‌లోకి వ‌చ్చాడు.అంతే కౌశ‌ల్ ఆర్మీ సామ్రాట్‌ని ఫేస్‌బుక్‌లో ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.అప్ప‌టికే చాలా ఓపిక‌గా వారికి స‌మాధానం ఇచ్చిన సామ్రాట్ ,చివ‌రికి చేసేది లేక త‌న బాధ‌ను కౌశ‌ల్‌కు మొర‌పెట్టుకున్నాడు.కౌశ‌ల్ బ్రో ప్లీజ్ మీ వాళ్ల‌ను కాస్తా కూల్ చేసే బాధ్య‌త మీదేనంటూ కౌశ‌ల్‌ను రిక్వెస్ట్ చేశాడు సామ్రాట్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -