బిగబాస్ రెండో సీజన్ గత ఆదివారం ముగిసింది.16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ రెండో సీజన్లో కౌశల్ విన్నర్గా నిలిచిన సంగతి తెలిసిందే.కౌశల్ విన్నర్ కావడంపై బిగ్బాస్ ఫైనలిస్ట్లో ఒకడైన సామ్రాట్ స్పందించాడు.తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిగ్బాస్ గురించి తన మనోభావాలను వెల్లడించాడు సామ్రాట్. కౌశల్ గురించి చెప్పాలంటే తను చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ‘కుక్కల్లా మీద పడుతున్నారు’ అని ఆయన అన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఆయన పట్ల నాకు ఎలాంటి కోపం లేదు. కౌశల్ టైటిల్ ను గెలుచుకోవడం నాకు సంతోషమే .. కాకపోతే నా దృష్టిలో మాత్రం బిగ్బాస్ విజేత గీతామాధురి” అని చెప్పుకొచ్చాడు.
తనీష్తో ఎలా చనువుగా ఉన్నానో అలాగే తేజస్వీతో కూడా ఉన్నాను.కాకపోతే బయట ఉన్నవారికి వేరేలా అర్థం అయింది.ఇది వాళ్ల తప్పు కాదు.నేను బయట ఉన్న అలాగే ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చాడు సామ్రాట్.హౌస్లో ఎక్కువ చీవాట్లు తిన్నది మాత్రం తనీషే.నానిగారు వచ్చి ప్రతివారం తనీష్ను తిట్టడం చూసి నాకు భయం వేసిందని తెలిపాడు.ఇక నా వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడే ఏం చెప్పాలేనని,కొన్ని షోలకి ఆఫర్స్ వస్తున్నాయని వాటిలో మంచి వాటిని ఎంపిక చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందకు వస్తానని తెలిపాడు సామ్రాట్.