బిగ్బాస్ రెండో సీజన్ మొదటి నుంచి వివాదాలతోనే సాగుతుంది.16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో చివరికి ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు.షో మొదటి నుంచి కౌశల్ను టార్గెట్ చేసుకుని మిగిలిన హౌస్మెట్స్ గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే.ఇంటి సభ్యులతో ఎవరితోను కలవని కౌశల్ షో మొదటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు.ఇక అతనితో గొవడ పడిన ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయి షో నుంచి వెళ్లిపోవడం మనం చూస్తునే ఉన్నాం.తాజాగా కౌశల్ మాట్లాడిన కుక్క అనే పదాన్ని పట్టుకుని ఇంటి సభ్యులు అతనిపై గొడవకు దిగుతున్నారు.మమ్మల్ని కుక్క అంటావా అంటు సామ్రాట్ కౌశల్పై ఫైర్ అయ్యాడు.మరి ఇదే సామ్రాట్ కౌశల్ను తేజస్వీని ఇంట్లో కుక్కలు అరుస్తున్నాయి.ఓ కుక్క తింటుంది అని కౌశల్ను ఉద్దేశించి కామెంట్స్ చేసినప్పుడు ఆమె పక్కనే కుర్చున్న సామ్రాట్ ఆ మాటాలను ఎంజాయ్ చేశాడు.
మరి ఇప్పుడు కుక్క అంటే మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. ఏదైన తన వరకు వస్తే తెలియదంటారు.ఇప్పుడు కుక్క అనేసారికి సామ్రాట్కు ఎక్కడ లేని కోపం వచ్చింది.ఇక హౌస్లో లేని కౌశల్ భార్య గురించి మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయమో వారే చెప్పాలి.కౌశల్ను ఆయన భార్య నీలిమ ఎలా భరిస్తుందో అని దీప్తి అన్నప్పుడు ఇంటి సభ్యులు కనీసం ఆమె గురించి ఎందుకు మనకెందుకు అని కూడా అనలేదు.ఇప్పడు మాత్రం కుక్కల్లా మీద పడుతున్నారంటే మాత్రం తప్పు వచ్చింది వీరికి.మరి వీరు ఆడుతున్న గేమ్లో నీతి నిజాయితి ఎక్కడ ఉందో వారే చెప్పాలి.