Sunday, April 28, 2024
- Advertisement -

‘బిగ్‌బాస్‌’లోకి వచ్చిన ఈ కొత్త అమ్మాయి ఎవరో తెలుసా..?

- Advertisement -

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో నుంచి ఇద్దరు నిష్క్రమించారు. వారిలో ఒకరు హీరో సంపూర్ణేష్ బాబు కాగా.. మరొకరు సింగర్ మధుప్రియ. తొలి వారంలోనే నటి జ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ షో మొత్తం 14మందితో మొదలైయితే.. ఇద్దరు ఎలిమినేట్ కాగా, ఒకరు అర్థంతరంగా తప్పుకొన్నాడు. ఈ క్రమంలో ఈ రియాలిటీ షోకు మరింత ఊపు తెచ్చేందుకు ఓ హాటెస్ట్‌ భామను రంగంలోకి తీసుకొస్తున్నారు.

అర్థంతరంగా వెళ్లిపోయిన సంపూ స్థానంలో హీరోయిన్ దీక్షా పంత్ హౌస్ లోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోని వారిని సర్‌ప్రైజ్‌ ఇస్తూ.. స్మిమ్మింగ్‌పూల్‌లోకి దిగి హాట్‌ హాట్‌గా ఆమె ఎంట్రీ అయ్యే ఎపిసోడ్‌ను సోమవారం ప్రసారం కానుంది. అయితే.. ఇప్పటికే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ముమైత్‌ ఖాన్‌కు తెలుగు రాదు. దాంతో ఇంటిలోని వారంతా ఆమెతో ఇష్టం వచ్చిన భాషల్లో మాట్లాడుతున్నారు.

రీసెంట్ గా వచ్చిన దీక్షా పంత్‌కు కూడా అస్సలు తెలియదు. ఇదే డౌట్‌ వచ్చి ఆమెతో ఒకటి నంచి 11 వరకు లెక్కపెట్టాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ కోరగా.. ఆమె నానా తంటాలు పడి.. 20వరకు లెక్కపెట్టింది. తెలుగురాని ముమైత్‌కు దీక్ష కూడా తోడైతే.. షోలో ఇక తెలుగుభాష వినిపించడం కష్టమే అని అంటున్నారు.

https://www.youtube.com/watch?v=JAbUjq-V2zU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -