Friday, March 29, 2024
- Advertisement -

రెమ్యూనరేషన్ వద్దంటున్న స్టార్ డైరెక్టర్

- Advertisement -

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు’ సీక్వెల్ గా ఇప్పుడు ‘భారతీయుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయింది. 15 రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుండటంతో నిర్మాతలు సినిమా హోల్డ్ లో పెట్టేసారు. ఆ తర్వాత శంకర్ కూడా వేరే సినిమాలు చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఏవి వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో చేసేది లేక మళ్ళీ ‘భారతీయుడు 2’ పైనే దృష్టి పెట్టాడు శంకర్.
నిర్మాతల వద్దకు వెళ్లి తను పారితోషికం సగం తగ్గించుకుంటానని చెప్పి వారిని ఒప్పించాడు.

ఆ సగం పారితోషికం కూడా సినిమా విడుదల అయ్యాక హిట్ అయితేనే తీసుకుంటానని హామీ ఇచ్చాడట. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధార్థ్, రకుల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘భారతీయుడు’ సినిమా బ్లాక్బస్టర్ అయినప్పటికీ ‘భారతీయుడు 2’ సినిమా ఆలస్యం అవుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి అని అభిమానులకు సైతం నిరాశ పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -