- Advertisement -
శాండిల్వుడ్కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కే.ఎం.విష్ణువర్ధన్ సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీని కలచివేసింది.విష్ణువర్ధన్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు.సీరియస్గా ఉండటంతో ఆదివారం బెంగుళూరు ఆస్పత్రిలో చేర్పించారు.పరిస్థితి చేయి దాటి పోవడంతో చికిత్స పొందుతు సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు.
ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.సుదీప్, దర్శన్, శివన్న వంటి తారలు నటించిన హిట్ సినిమాలకు విష్ణువర్ధన్ ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిచూపు కోసం ఉంచారు. అంత్యక్రియల కోసం తమకూరు జిల్లాలోని కుదూరుకి తరలించారు.