Sunday, May 19, 2024
- Advertisement -

మందు కొట్టి ఐపీఎల్‌లో ర‌చ్చ చేసిన తెలుగు యాంక‌ర్‌

- Advertisement -

ఈ రోజుల్లో అబ్బాయిల‌తో ఆడ‌వాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌నేది అక్ష‌ర స‌త్యం. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందు వ‌రుస‌లో ఉన్నారు. అది మందు కొట్టే విష‌యంలో కూడా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…. నిన్న(ఆదివారం) హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు కోల్‌క‌తాతో టీంతో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తాపై స‌న్ రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఈ మ్యాచ్ చూడటానికి వ‌చ్చిన తెలుగు యాంక‌ర్ ప్ర‌శాంతి తాగి వ‌చ్చి స్టేడియంలో ర‌చ్చ రచ్చ చేసింది.

తన స్నేహితులు ప్రియ, పూర్ణిమ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ లతో కలసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది. తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలా ప్ర‌శాంతి బిహేవ్ చేసింది. సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యకరంగా ప్రవర్తించింది. వీరి చేష్టలతో అసహనానికి లోనైన ఓ వీక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యాంక‌ర్ ప్ర‌శాంతి తాగి అల్ల‌రి చేసిన దృశ్యాలు సీసీ కెమేరాలో క‌నిపించాయి. సీసీ టీవీ ఫూటేజిని పరిశీలించిన పోలీసులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. సెల‌బ్రిటీ అయి ఉండి ప‌బ్లిక్‌లో ప్ర‌శాంతి ఇలా ప్ర‌వ‌ర్తించిన తీరును అంద‌రు విమ‌ర్శిస్తున్నారు. టాలీవుడ్‌లో చాలాకాలం నుంచి యాంక‌ర్‌గా వ్య‌వహారిస్తోంది ప్ర‌శాంతి.

https://www.youtube.com/watch?v=ycJI4miXIJY

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -