Friday, April 26, 2024
- Advertisement -

శ్రీదేవి మ‌ర‌ణంపై స్పందించని తొలి ‘హీరో’

- Advertisement -

ఒక‌ప్ప‌టి హీరో చంద్ర‌మోహ‌న్ ఇప్పుడేమ‌య్యాడు..

దుబాయ్‌లో గుండెపోటుతో మ‌ర‌ణించిన శ్రీదేవీ ‘ప‌ద‌హారేళ్ల వ‌య‌సు’ సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది. సిరిమ‌ల్లె పువ్వా అనే పాట‌తో అప్ప‌టి కుర్ర‌కారునే ఇప్ప‌టి కుర్ర‌కారును గిలిగింత‌లు పెట్టిన అందం శ్రీదేవిది. ఆ సినిమాలోని ఆ పాట‌తో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ హీరోయిన్‌గా మారింది. ఆ తొలి సినిమాలో చంద్ర‌మోహ‌న్‌తో క‌లిసి హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమాను రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాఘ‌వేంద్ర‌రావు హీరోయిన్‌గా సావిత్రి గుర్తింపు పొందారు. ఎక్కువ రాఘవేంద్ర‌రావుకు అవ‌కాశాలు ఇచ్చింది శ్రీదేవి. అయితే ఈ సినిమాలో న‌టించిన ఇప్పుడు బ‌తికి ఉన్న న‌టీన‌టులు స్పందించి ఆమెతో త‌మ జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకున్నారు.

మోహ‌న్‌బాబు, రాఘ‌వేంద్ర‌రావు క‌న్నీళ్ల‌లో మునిగిపోయారు. అయితే శ్రీదేవి తాను తొలిసారి న‌టించిన హీరో చంద్ర‌మోహ‌న్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు శ్రీదేవి మృతిపై స్పందించ‌లేదు. త‌న‌తోనే తొలి సినిమాలో న‌టించి ఆ త‌ర్వాత అగ్ర తార‌గా ఎదిగిన ఆమెను చంద్ర‌మోహ‌న్ మ‌ర‌చిపోలేరు. శ్రీదేవి మ‌ర‌ణించి రెండు రోజులు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌మోహ‌న్ స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మేస్తోంది.

చంద్ర‌మోహ‌న్ ఒకప్పుడు హీరోగా రాణించి ఇప్పుడు ప్ర‌ధాన పాత్ర‌ల్లో సినిమాల్లో క‌నిపిస్తున్నాడు. టాలీవుడ్‌ను అప్ప‌టి నుంచి వ‌ద‌ల‌డం లేదు. ఇప్పుడు ఆయ‌న స్పందించ‌క‌పోవ‌డం కార‌ణ‌మేంటో తెల‌వ‌డం లేదు. ప్ర‌స్తుతం చంద్ర‌మోహ‌న్ కూడా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది. అత‌డు ఇప్పుడు సినిమాల్లో కూడా క‌నిపించ‌డం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -