Tuesday, May 21, 2024
- Advertisement -

తండ్రి నాగార్జున బాట‌లో నాగ‌చైత‌న్య‌

- Advertisement -

శ్రీనివాస్‌రెడ్డితో క‌లిసి ‘ధర్మాభాయ్‌’ సినిమా

అక్కినేని కుటుంబ వార‌సుల‌కు తండ్రి నాగార్జున‌నే సినిమా బాట ప‌రుస్తున్నారు. తండ్రి ఎంపిక చేసిన క‌థ‌ల్లో న‌టించేందుకు ఇద్ద‌రు న‌టుడు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. నాగ‌చైత‌న్యను ప‌క్క‌కు పెడితే అఖిల్‌ను మాత్రం నాగార్జున‌నే తీర్చిదిద్దుతున్నారు. ఇటీవ‌ల అఖిల్ న‌టించిన హ‌లో సినిమాను అన్నీ తానై నాగార్జున వ్య‌వ‌హ‌రించారు. దాంతో అఖిల్ ఓ విజ‌యం అందుకున్నారు. త‌మ ఫ్యామిలీకి అభిమాన ద‌ర్శ‌కులుగా క‌ల్యాణ్ కృష్ణ‌, కె.విక్ర‌మ్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు నిలుస్తున్నారు.

ఇప్పుడు అదే బాట‌లో నాగచైతన్య ఉన్నాడు. తండ్రితో సినిమా తీసిన ద‌ర్శ‌కుడితో చైతూ ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. నాగార్జున‌తో ‘ఢమరుకం’ సినిమాను శ్రీనివాస్‌రెడ్డి తెర‌కెక్కించాడు. ఆయ‌న‌తో తీసే సినిమా టైటిల్‌ను కూడా ప్ర‌క‌టించారు. ‘ధర్మాభాయ్‌’గా టైటిల్ ఫిక్స్ చేశారంట‌. ఈ సినిమాకు ‘ఢమరుకం’ చిత్ర రచయిత ఆకుల శివ కథ రాస్తున్నాడు.

ప్రస్తుతం చైతూ ‘సవ్యసాచి’ చందూ మొండేటి దర్శకత్వంలో వ‌స్తోంది. నిధి అగర్వాల్‌ కథానాయిక. మాధవన్‌, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాబోతోంది. దీంతో పాటు మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జా రెడ్డి అల్లుడు అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ధ‌ర్మాభాయ్ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -