ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అయితే ప్రేక్షకులు ఏ సినిమాను చూస్తారో అనే భయంతో ఉంటారు ఆ హీరోలు. ప్రస్తుతం అదే సమస్యను ఫేస్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ హీరోలు. అయితే ఈ సమస్యను మెగాస్టార్ చిరంజీవి తీర్చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలలోకి వెళ్తే.. మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచియమైన సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యు సినిమాను జులై 6న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఈ సినిమాకు ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక అదే రోజున వస్తానని ప్రకటించాడు మరో మెగా హీరో. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచియమవుతున్న సినిమా విజేత. ఈ సినిమాను జులై 6నే విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి ప్రకటించారు. దీంతో ఇద్దరు మెగా హీరోల మధ్య పోటీ తప్పదని భావించారు అందరు. కాని రంగంలోకి దిగిన చిరు , పరిస్థితిని చక్కదిద్దరని తెలుస్తుంది.
రెండు సినిమాలు ఒకే రోజు వస్తే అభిమానులపై ఒత్తిడి పెరుగుందని. ఒక సినిమాకు న్యాయం,మరోక సినిమాకు అన్యాయం జరుగుతుందని వారించడంతో విజేత సినిమా విడుదల తేదీని మార్చారు చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి. తేజ్ ఐ లవ్ యు సినిమా జులై 6నే విడుదల చేయగా,విజేత సినిమాను జులై 12కు పోస్ట్ పోన్ చేశారు.