Sunday, April 28, 2024
- Advertisement -

ఆ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చలేదట.. అందుకే..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రారాజుగా వెలిగిపోతున్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లారు. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ తెరపై కనిపించాడు. వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ మూవీలో ఓ ప్రధాన పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరో ముఖ్యపాత్రలో పూజా హెగ్డే కనిపించబోతుంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సినిమా తరువాత చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లో చేయనున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి.. భారీ వసూళ్లు రాబట్టింది. మాలీవుడ్ లో ఈ మూవీ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు.

అయితే తమిళంలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న మోహన్ రాజాకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. ఈ మూవీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ తయారు చేయాలని చిరు డైరెక్టర్ కి చెప్పినట్లు సమాచారం. అయితే మోహన్ రాజా చేసిన మార్పుల పట్ల చిరంజీవి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదట. దాంతో చిరు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యే.. టీఆర్ఎస్ మహిళా నేత హల్ చల్!

రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -