Thursday, May 2, 2024
- Advertisement -

మెగా మేనల్లుడు… తెలివైనోడే…..

- Advertisement -

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ … మితిమీరిన దూకుడులో క్లారిటీ మిస్ అయిపోయాడు. ఇప్పటి వరకు మొహమాటానికి ఒప్పుకున్నాడో లేక కన్విన్స్ చేయడం వలన యాక్సెప్ట్ చేసాడో తెలియదు గాని మొత్తానికి చేసిన సైన్స్.. చాలనుకుని ఓ అండర్ స్టాండ్ కు వచ్చినట్లున్నాడు. అతని తాజా మూమెంట్స్ చూస్తే ఈ విషయం కనిపిస్తుంది.

తిక్క, విన్నర్ తో రెండు అప్పడాలు తినేసిన ఈ పంజా వేమవరం కుర్రాడు.. ఇపుడు గతంలో చేసిన తప్పిదాలను మళ్లీ చేయకుండా సాలిడ్ స్టెప్స్ వేస్తున్నాడు. దానిలో భాగంగా ఎంచుకున్న దర్శకులే వినాయక్ ,కరుణా కరణ్ లు. ఈ ఇద్దరితో చేయబోయే వెంచర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కరెక్ట్ గా బన్నీకి మంచి పోటీ ఇచ్చే మెగా కుర్రాడుగా గుర్తింపు పొందుతోన్న టైమ్లో వరుస ఫ్లాప్స్ వచ్చి తన ఫ్లో ఎలా అయితే పోయిందే అదే విదంగా మళ్ళీ ఊపందుకోవాలని చూస్తున్నాడు.

తాజాగా జవాన్ కూడా ఎప్పుడు విడుదలవుతుందో తెలియకపోవడంతో ల్యాబ్ లో ఉండిపోయే చిత్రాలను అవుట్ డేటెడ్ దర్శకులను ఇకనుంచి టచ్ చేయకూడదనుకుంటున్నాడట. ఆ రకంగా చూసినప్పుడు వినాయక్ ,కరుణాకరన్ లు కూడా అదే క్యాటగిరీ కదా అంటే నవ్వుతున్నాడు. మొత్తానికి లౌక్యం అయితే నేర్చుకున్న తేజు.. రానున్న రోజులలో యూత్ హీరోలతో ఎంత వరకు తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -