Thursday, May 2, 2024
- Advertisement -

పుట్టినరోజు పార్టీ ని పోస్టుపోన్ చేసిన చిరంజీవి

- Advertisement -

ప్రతి ఏటా మెగా అభిమానులు మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు ని ఒక పండుగలాగా చేసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం చిరు పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంటారు మెగా అభిమానులు. అయితే ఈ సంవత్సరం మాత్రం పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందే మొదలయ్యాయి. ఆగస్టు 21వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది.సినిమా మరియు రాజకీయాల నుండి కొందరు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు.

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు. అయితే అందరికంటే స్పెషల్ గెస్ట్ మాత్రం చిరంజీవి తమ్ముడు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’ సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ చిరంజీవి గురించి మరియు ‘సైరా’ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సైరా’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇక నిన్న చిరంజీవి పార్టీ ఇస్తారు అని చాలా మంది ఆశించారు కానీ నిజానికి చిరంజీవి మాత్రం సై రా సినిమా విడుదల అయ్యాక, సినిమా విజయాన్ని, తన పుట్టిన రోజుని కలిపి ఒక రోజు పెద్ద పార్టీ ఇవ్వనున్నారని తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -