చిరంజీవి నటించిన ఖైదీ 150 మూవీ విడుదలై సంవత్సరం దాటింది.ఈ సినిమా తరువాత చిరు ‘సై రా నరసింహారెడ్డిలో నటిస్తున్నారు.స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా షూటింగ్ చాలా కాలం అయిన ఇప్పటి వరకు సినిమాకు సంగీత దర్శకుడిని ఇంతవరకు తీసుకోలేదు చిత్ర యూనిట్.మొదట ఏఆర్ రెహ్మాన్ అని అనౌన్స్ చేయగా, డేట్స్ క్లాష్ అవుతున్నాయని ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
తాజాగా ఈ సినిమా మ్యూజిక్ దర్శకుడిని ఎంపిక చేశారు.బాలీవుడ్కు చెందిన అమిత్ త్రివేదిని ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు టాక్.ఇప్పటికే అమిత్ ఈ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి పుట్టిన రోజున సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.