- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి – త్రిష కాంబినేషన్లో వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
తాజాగా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్సా్. హైదరాబాద్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుందని ఈ షెడ్యూల్లో చిరంజీవి, త్రిష పాల్గొన్నారని తెలిపారు. అలాగే కొన్ని టాకీ పార్ట్స్తో పాటు సాంగ్, యాక్షన్ పార్ట్ని తెరకెక్కించినట్లు వెల్లడించారు.
ఇందుకు సంబంధింది ఓ ఫోటోని షేర్ చేయగా ఇందులో చిరు,త్రిషతో పాటు సంగీత దర్శకుడు కీరవాణి ఉన్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు.