Thursday, May 2, 2024
- Advertisement -

సైరా కు ఎదురుతిరిగిన ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సైరా సినిమా అనుకోని సంఘటనల వల్ల వార్తల్లోకి ఎక్కింది.

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కుటుంబ సభ్యులు రామ్ చరణ్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. సినిమా కథ మొత్తం తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఈ మధ్య కనీసం కలవడం కూడా లేదని వారు ఆందోళన చెందారు. మరి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మరియు మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతారో ఇంకా తెలియాల్సి ఉంది. అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార వంటి స్టార్ లు నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -