Saturday, April 27, 2024
- Advertisement -

రీ ఎంట్రీలో కలర్స్​ స్వాతి దూకుడు..!

- Advertisement -

టీవీ యాంకర్​గా కెరీర్​ ప్రారంభించిన కలర్స్​ స్వాతి .. అప్పట్లో యువకుల మనసులు దోచేసింది. ఇక ఆమెకు ఉన్న ఫాలోయింగ్​ చూసి సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. అష్టాచమ్మాతో ఇండస్ట్రీకి పరిచయమైన కలర్స్​ స్వాతి.. తక్కువ కాలంలోనే ఫేమస్​ అయిపోయింది. కేవలం కొన్ని రకాల పాత్రలే చేసుకుంటే ముందుకు సాగింది. అయితే స్వాతికి పెద్ద హీరోలతో చాన్స్​ దొరకలేదు. యువ హీరోలు, తక్కువ బడ్జెట్ సినిమాల్లోనే ఆమెకు అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని ఇండోనేషియాలో సెటిల్​ అయ్యింది. అయితే స్వాతి సెకండ్​ ఇన్సింగ్స్​ స్టార్ట్​ చేయబోతున్నట్టు సమాచారం. గతంలో ఆమె హీరో నిఖిల్​తో చేసిన కార్తికేయ హిట్​ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నారు. సీక్వెల్​లో కూడా స్వాతికే అవకాశం దక్కినట్టు సమాచారం.

Also Read: అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?

నిఖిల్ తో స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాల్లో స్వాతి నటించి ఆకట్టుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వాతి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే స్వాతి పంచతంత్రం అనే మూవీలో నటిస్తోంది. ఇక నిఖిల్​ కూడా ఈ మధ్య పెద్దగా హిట్​లు పడటం లేదు. అర్జున్​ సురవరం చిత్రం యావరేజ్​గా నిలించింది. ఇక నిఖిల్​ కరోనా సెకండ్​వేవ్​లో ఎందరో కరోనా బాధితులకు అండగా నిలబడ్డారు.

Also Read: అయ్యో రకుల్ ఏంటీ పరిస్థితి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -