టీవీ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన కలర్స్ స్వాతి .. అప్పట్లో యువకుల మనసులు దోచేసింది. ఇక ఆమెకు ఉన్న ఫాలోయింగ్ చూసి సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. అష్టాచమ్మాతో ఇండస్ట్రీకి పరిచయమైన కలర్స్ స్వాతి.. తక్కువ కాలంలోనే ఫేమస్ అయిపోయింది. కేవలం కొన్ని రకాల పాత్రలే చేసుకుంటే ముందుకు సాగింది. అయితే స్వాతికి పెద్ద హీరోలతో చాన్స్ దొరకలేదు. యువ హీరోలు, తక్కువ బడ్జెట్ సినిమాల్లోనే ఆమెకు అవకాశాలు వచ్చాయి.
ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని ఇండోనేషియాలో సెటిల్ అయ్యింది. అయితే స్వాతి సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. గతంలో ఆమె హీరో నిఖిల్తో చేసిన కార్తికేయ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నారు. సీక్వెల్లో కూడా స్వాతికే అవకాశం దక్కినట్టు సమాచారం.
Also Read: అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?
నిఖిల్ తో స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాల్లో స్వాతి నటించి ఆకట్టుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వాతి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే స్వాతి పంచతంత్రం అనే మూవీలో నటిస్తోంది. ఇక నిఖిల్ కూడా ఈ మధ్య పెద్దగా హిట్లు పడటం లేదు. అర్జున్ సురవరం చిత్రం యావరేజ్గా నిలించింది. ఇక నిఖిల్ కరోనా సెకండ్వేవ్లో ఎందరో కరోనా బాధితులకు అండగా నిలబడ్డారు.
Also Read: అయ్యో రకుల్ ఏంటీ పరిస్థితి..!