హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత పెద్దగా సక్సెస్ సాధించలేదు. స్వామిరారా చిత్రం తర్వాత మనోడికి వరుస హిట్స్ కలిసి వచ్చాయి. కార్తికేయ చిత్రం నిఖిల్ కి మంచి పేరు తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఆ మద్య ఈ చిత్ర షూటింగ్ సమయంలో నిఖిల్ కి చిన్న ప్రమాదం జరిగింది.. దాంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు.
తాజాగా మరోసారి ఈ చిత్ర షూటింగ్ కి అవాంతరాలు ఏర్పడ్డాయి. షూటింగ్ కు భారీ మంచు వర్షం ఆటంకాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దులకు సమీపంలో ఉన్న సిస్సులో జరుగుతుండగా, అక్కడ దట్టమైన మంచు కురుస్తోంది. దీంతో చిత్ర బృందం షూటింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది.
ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా మారాయని.. అందుకే షూటింగ్ ఆపివేయాల్సి వచ్చిందని.. పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఓ యాక్షన్ ఎపిసోడ్ తీయబోతున్నట్లు హీరో నిఖిల్ వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా టీకా వేయించుకున్న కండల వీరుడు!