Sunday, May 5, 2024
- Advertisement -

ప‌వ‌న్ ఏం తింటారో అర్థం కావ‌డం లేదు – క‌మెడియ‌న్ పృధ్వీ

- Advertisement -

క‌మెడియ‌న్ పృధ్వీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప‌వ‌న్ ఏం తింటారో తెలియ‌క‌పోచ్చు కానీ… జనసేన హవా ఎలా ఉందో మాత్రం లెక్కగట్టగలనని అంటున్నారు పృధ్వీ. ఎన్నో ప్రాంతాలు తిరిగి జనాలతో ఉండడం వలన తను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు వెల్లడించారు.తాను ఏసీ రూంల‌లో కుర్చోని ఈ మాట చెప్ప‌డం లేద‌ని ఎన్నో ప్రాంతాలు తిరిగి జనాలతో ఉండడం వలన తను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు వెల్లడించారు.”పవన్ కళ్యాణ్ వాదనలు ఆయనకున్నాయి. అవన్నీ ప్రజలకు నచ్చుతాయని నేను అనుకోవడం లేదు. నేను కూడా స్టేజ్ ఎక్కిన తరువాత వంద మాట్లాడతాను.

పవన్ కూడా అంతే.. అవన్నీ వినే ఓపిక జనాలకు లేదు. ఆయనకు ఓ పార్టీ ఉంది, ఎజెండా ఉంది.ఆయన హవా ఎలా ఉంటుందో.. అదంతా జనాలు తేలుస్తారు” అంటూ వెల్లడించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా జనసేనకి పడదని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు వైసీపీని ఆరాదిస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ని చూడడం కోసం మాత్రం జనాలు వస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. పృధ్వీ మొద‌టి నుంచి వైసీపీ పార్టీకి సానుభూతిప‌రుడిగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -