Thursday, May 2, 2024
- Advertisement -

బాల్కనీ నుంచి డబ్బులు విసిరేవాడు.. శ్రీహరిపై పృద్వి రాజ్ కామెంట్స్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోగా, విలన్ గా ఎంతో అద్భుతంగా నటించిన టాలీవుడ్ షేర్ ఖాన్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న స్వర్గీయ శ్రీహరి డిస్కో శాంతిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కేవలం తెరపై మాత్రమే కాకుండా తెర వెనుక కూడా శ్రీహరి ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి. ఈ మంచితనం వల్లే ఎంతో మందికి ఎంతో సహాయం చేశారు.

శ్రీహరి మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు. శ్రీహరి బతికున్నప్పుడు ఎంతటి త్యాగాలను దానాలను చేశారు. అతని మరణాంతరం అతని కుటుంబానికి సహాయం చేసే వారే కరువయ్యారని గతంలో శ్రీహరి భార్య డిస్కోశాంతి ఎమోషనల్ అయ్యారు.తాజాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్విరాజ్ నటుడు శ్రీహరి మనస్తత్వం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Also read:ప్రస్తుతం అలాంటి ఆలోచనే లేదు… ఫోకస్ అంతా కెరియర్ పైనే: అంజలి

ఈ క్రమంలోనే పృథ్వి మాట్లాడుతూ… శ్రీహరి ఎంత గొప్ప వారంటే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లోని ఆయన ఇంటి ముందు ఎవరైనా నిలబడి కనపడితే చాలు.. బాల్కనీ నుంచి రాయికి డబ్బులు చుట్టి విసిరేవారు. వాళ్లు ఆ డబ్బులు తీసుకొని మంచి మనసుతో ఆయనకి నమస్కరించి వెళ్లేవారని ఈ విధంగా శ్రీహరి చేసిన గుప్తదానాలు గురించి పృథ్వి రాజ్ గుర్తు చేసుకున్నారు. శనివారం ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమానికి బెనర్జీ, పృథ్వీ, జ్యోతి, సుదర్శన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ షోలో శ్రీహరి, ఉదయ్ కిరణ్ గురించి అందరూ తలుచుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఇన్నాళ్ల కెరీర్ లో స్టైలిష్ స్టార్ మిస్ చేసుకున్న సినిమాలు ఏవో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -