టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణు మాధవ్కు చాలా రోజులు నుంచి సరైన అవకాశాలు రావడం లేదు.ఒకనొక దశలో వేణు మాధవ్ చనిపోయ్యాడంటూ వార్తలు కూడా వచ్చాయి.తాజాగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. వేణు మాధవ్ మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు.వేణు మాధవ్ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ.అయన అక్కడ నుంచే పోటీ చేయనున్నారు.అయితే టీడీపీ తరుపున కాకుండా స్వతంత్ర అభ్యర్ధిగా ఈరోజు నామినేషన్ వేయనున్నారు వేణు మాధవ్.
కమెడియన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించిన వేణుమాధవ్ రాజకీయ నేపధ్యం గల కుటుంబానికి చెందినవారే. తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు నామినేషన్ వేయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.మిమిక్రీ ఆర్టిస్ట్గా తన కెరీర్ మొదలు పెట్టిన వేణు మాధవ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగారు. భవిష్యత్తులో ఆయనను ఎమ్మెల్యేగా కూడా చూడవచ్చు ఏమో.