Saturday, April 27, 2024
- Advertisement -

నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్!

- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 251 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,692కు పెరిగింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు ఈ మహమ్మారికి బలి అవుతున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ నేతలకు కరోనా వైరస్ వల్ల చనిపోతున్న విషయం తెలిసిందే.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ లు సెలబ్రెటీలు తీసుకుంటున్నారు. తాజాగా తాజాగా నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మాధవన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఆల్ ఈజ్ వెల్. త్వరలోనే  కరోనా వైర‌స్‌కి కూడా త్వ‌ర‌లో చెక్ ప‌డుతుంది. మాతో పాటు రాజు రాకూడ‌ద‌ని అనుకుంటున్నాము.

అంద‌రికీ థ్యాంక్స్. నా ఆరోగ్యం బావుంది అని మాధవన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బుధవారం నటుడు అమీర్ ఖాన్ కి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిన విషయం తెలిపారు. ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నట్లు, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అతని మేనేజర్‌ తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -