Friday, May 10, 2024
- Advertisement -

మొత్త‌నికి బ‌య‌టికి వ‌చ్చిన సురేష్ బాబు

- Advertisement -

ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు చాలా రోజుల త‌రువాత బ‌య‌ట క‌నిపించారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న బ‌య‌ట ప్ర‌పంచానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కార‌ణం అంద‌రికి తెలిసిందే.న‌టి శ్రీరెడ్డి ద‌గ్గ‌బాటి సురేష్ బాబు రెండో త‌న‌యుడు అభిరాం త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి త‌న‌ని లైంగికంగా వాడుకున్నాడని కొన్ని మీడియా ఛానెల్స్ తిరిగి మ‌రి త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది.అభిరాంతో త‌ను చాలా క్లోజ్‌గా దిగిన ఫోటోల‌ను మీడియాకు లీక్ చేసింది.దీంతో ఈ వివాదం మ‌రింత ముదిరింది.శ్రీరెడ్డి ఫిలిం ఛాంబ‌ర్ ద‌గ్గ‌ర అర్థ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో వివాదం తార స్థాయికి చేరుకుంది.నేష‌న‌ల్ లేవ‌ల్లో ఈ వివాదం పాపుల‌ర్ అయింది.

అంద‌రు సురేష్ బాబు స్పందించాల‌ని డిమాండ్ చేశారు.మ‌రోవైపు శ్రీరెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అనుచిత వాఖ్య‌లు చేయ‌డంతో సురేష్ బాబు దీని నుంచి కొంత బ‌య‌ట‌ప‌డ్డాడు అనే చెప్పాలి. మీడియా మొత్తం ప‌వ‌న్ , శ్రీరెడ్డి, వ‌ర్మ‌ల‌పై పోక‌స్ పెట్ట‌డంతో సురేష్ బాబుని పెద్ద‌గా ఎవ‌రు ప‌ట్టించుకొలేదు.స‌డ‌న్‌గా సురేష్ బాబు ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు శిలా విగ్రహ ఆవిష్కరణకు అటెండ్ అయ్యారు. నందమూరి బాలకృష్ణతో పాటు పలువురితో కలిసి సాధారణంగానే కనిపించారాయన.ముఖ్యంగా ఇది దిగ్గజ దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం కావడంతో.. వేరే టాపిక్స్ ఏవీ వచ్చే ఛాన్స్ లేదు.తన కుమారుడు తప్పు చేసి ఉంటే.. చట్టప్రకారమే అంతా జరుగుతుందని సురేష్ బాబు చెప్పారనే టాక్ ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -