Monday, May 6, 2024
- Advertisement -

‘RRR’ నుంచి త‌ప్పుకున్న హీరోయిన్‌

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి వంటి చారిత్రత్మ‌క చిత్రం త‌రువాత తీస్తోన్న సినిమా RRR(వ‌ర్కింగ్ టైటిల్‌). ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమ‌రం భీమ్‌గా న‌టిస్తుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామరాజుగా క‌నిపించ‌నున్నాడు. మీడియా స‌మావేశం పెట్టి మ‌రి త‌న సినిమా క‌థ‌ ఫ‌లానా అని చెప్పిన రాజ‌మౌళి, ఇదే వేదిక మీద త‌మ సినిమాలో హీరోయిన్స్‌ను కూడా ఎనౌన్స్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, మ‌రో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ‌ డైసీ ఎడ్గర్ జోన్స్ న‌టిస్తుంద‌ని రాజ‌మైళి ప్ర‌క‌టించారు. తాజాగా సినిమా యూనిట్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. RRR నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ సినిమాలో నటించడం లేదు. ఆమెకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా ‘ అంటూ RRR టీం ఓ ట్వీట్ చేసింది. దీంతో ఆమె సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లే అని అధికారికంగా చెప్ప‌డం జ‌రిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మరో హీరోయిన్‌ని వెతికే ప‌నిలో ప‌డ్డాడు రాజ‌మౌళి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -