Friday, April 19, 2024
- Advertisement -

వివాదంలో దీపికా-ర‌ణ్‌వీర్‌ల పెళ్లి

- Advertisement -

బాలీవుడ్ స్టార్ క‌పూల్ దీపిక పదుకొనె-రణ్‌వీర్ సింగ్‌ల వివాహం వివాదంలో చిక్కుకుంది.ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో వివాహం చేసుకున్నారు. తొలుత కొంకణీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం 15న సింధీ సంప్రదాయంలో ఒక్కటయ్యారు. పెళ్లి సందర్భంగా నిర్వహించిన ‘ఆనంద్ కరాజ్’ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదమైంది.ఆనంద్ కరాజ్ కార్యక్రమం సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ ఆరోపించింది.

సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురుగ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదన్న నిబంధనను వారు ఉల్లంఘించారని సంస్థ అధ్యక్షుడు ఆరోపించారు. సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మరి దీనిపై మ‌త పెద్ద‌లు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాలి.ఇక ఇవేటి ప‌ట్టించుకోకుండా వారి ప‌నుల‌లో మునిగిపోయారు కొత్త జంట‌.త్వ‌ర‌లోనే వీరు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంద‌రికి పెద్ద పార్టీ ఇవ్వ‌నున్నారు.ఇక ఈ జంట పెళ్లి త‌రువాత ముంబైలోనే కాపురం పెట్ట‌నున్నారు.దీనికి సంబంధించి ఓ ప్లాట్‌నుచ కూడా కొనుగొలు చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -