- Advertisement -
మదురైకు చెందిన దంపతులకు హీరో ధనుష్..లాయర్ నోటీసులు పంపించారు. తమ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాలనీ.. లేకపోతే 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మదురై జిల్లాలోని మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు.. హీరో ధనుష్ తమ కుమారుడని నాలుగేళ్లుగా వాదిస్తున్నారు.
సినిమాల్లో నటించేందుకు ఇంటి నుంచి పారిపోయాడని ఆరోపించారు. ఈ మేరకు వారు మదురై మేలూరు కోర్టులో పిటిషన్ వేయగా.. దాన్ని న్యాయస్థానం కొట్టేసింది. దాంతో కదిరేశన్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు.
అక్కడా వారికి భంగపాటు ఎదురైంది. హైకోర్టు సైతం ఈ దంపతుల పిటిషన్ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ధనుష్ తండ్రి కస్తూరీరాజా తమను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఈ దంపతులు ఆరోపించారు. దీంతో ధనుష్ వారికి నోటీసులు పంపారు.