కేజీఎఫ్ తో కన్నడ హీరో యశ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. యశ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. త్వరలో కేజీఎఫ్ చాప్టర్ -2 విడుదల కాబోతున్నది. ఈ మూవీ కోసం .. ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే కేజీఎఫ్ ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్కు చాలా ఆఫర్స్ వచ్చాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆయన దర్శకత్వంలో సలార్లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా ఓ మూవీ చేస్తున్నాడు.
ఇంకా చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే కేజీఎఫ్ హీరో యశ్.. మాత్రం కేజీఎఫ్ -2 తర్వాత తన ప్రాజెక్ట్ను ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే యశ్ పలు కథలను వింటున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమన్నా హీరోయిన్గా ఓ మూవీకి ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన అధికారిక సమాచారం రాలేదు.
ఇదిలా ఉంటే యశ్.. ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్తో మూవీ చేయబోబుతున్నట్టు టాక్. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కబోతున్నదట. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు వచ్చే చాన్స్ ఉంది. యశ్కు ప్రస్తుతం తెలుగులో సైతం మార్కెట్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు ప్రొడ్యూసర్ తో చేసేందుకు ఓకే చెప్పినట్టు టాక్.
Also Read