Tuesday, May 14, 2024
- Advertisement -

నేను మ‌ద్యం తాగ‌లేదు మెర్రో.. అవి మంచి నీళ్లు : సినీ న‌టి ధన్య

- Advertisement -

ధన్య భాలకృష్ణ బెంగులూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, శృతి హాసన్ జంటగా నటించిన ‘సెవంత్‌ సెన్స్‌’ మూవీతో పరిచయం అయ్యింది ధన్య బాలకృష్ణ. ‘లవ్‌ ఫెయిల్యూర్‌’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజారాణి’ వంటి సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించింది ధన్య. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ముద్దు పేరు పప్పు అని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని వెల్లడించింది. ‘రాజారాణి’ సినిమాలో మందు తాగినట్లు చూపించారు, కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది. ప్రతి వీకెండ్‌లో మాత్రం స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పుకొచ్చింది.

పవన్‌ కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌ తన క్రష్‌లని, వీరితో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. అలాగే, లాంగ్‌ డ్రైవ్స్‌ లేదా కాఫీ తాగడానికి వెళ్తానని చెప్పింది. ఆమె క్రెడిట్‌ కార్డు నంబర్‌, దాని సీవీవీ నంబర్‌ చెప్పాల‌ని ఓ అభిమాని అడ‌గ‌గా అది మీకు ఎందుకు? అంటూ ధ‌న్య జవాబు ఇచ్చింది.

వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే.. అలా బ్రతకాల్సిందే: పూరి

పుట్టినరోజును అతనితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసిన.. అనసూయ!

పవన్ ‘ హరి హర వీరమల్లు’ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -