Sunday, May 5, 2024
- Advertisement -

‘ఇస్మార్ట్ శంకర్’ వల్ల చింతిస్తున్న దిల్ రాజు

- Advertisement -

రామ్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు పూరి జగన్నాథ్ మార్కెట్ బాగుండకపోవడంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు సినిమాపై ఆసక్తి చూపించలేదు. అందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు. నిజానికి ఈ సినిమా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. కానీ పూరి జగన్నాథ్ సినిమా ‘మెహబూబా’ డిజాస్టర్ అవడంతో రిస్క్ లేకుండా దిల్ రాజు ఈ సినిమాని తక్కువ రేటుకి అమ్మమని అడిగారు.

కానీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో పూరి మరియు చార్మీ ఏమాత్రం తగ్గలేదు. దిల్ రాజు చెప్పిన రేటుకి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో దిల్ రాజు సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు తన నిర్ణయానికి దిల్ రాజు బాధపడుతున్నారని తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే 16.73 కోట్లు అందులో మూడు రోజుల్లోనే వసూలు చేసింది. అందులో 7.36 కోట్లు కేవలం నైజాం ఏరియా నుంచి మాత్రమే వచ్చినవి. ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజానికి ఈ సినిమా చాలా మంది హిట్ అవుతుందని అనుకున్నారు కానీ బ్లాక్బస్టర్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. దీంతో దిల్ రాజు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేపట్టలేకపోయినందుకు చింతిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -