- Advertisement -
వరుస హిట్ సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నా దిల్ రాజు. తాజాగా మరో సినిమాను నిర్మించె పనిలో బిజీగా ఉన్నారు. గతంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన చేసిన ‘శతమానం భవతి’ భారీ విజయాన్ని సాధించిందిచిన సంగతి తెలసిందే. దాంతో అదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు దిల్రాజు.
కొత్తగా నిర్మించె సినిమాకు శ్రీనివాసకళ్యాణం అనే టైటిల్ను ఖరారు చేశారు. ముందుగా ఈకథను నాగార్జునతో చేయాలనుకున్నా కుదరకపోవడంతో …జూనియర్ ఎన్టీఆర్కు కథ వినిపించారు. కథ అయనకు నచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఏమైందో గాని ప్రస్తుతం సినిమాను నితిన్తో చేయడానికి సిద్దమయ్యారంట దిల్రాజు. త్వరలోనె ఈసినిమా పట్టాలెక్కనుంది.