Sunday, April 28, 2024
- Advertisement -

ఆ ద‌ర్శ‌కుడిని త‌రిమేసిన దిల్ రాజు

- Advertisement -

సక్సెస్ నిర్మాత దిల్ రాజుకు న‌చ్చితే వారికి జీతాలిచ్చి మరీ పోషిస్తుంటాడు. ప్రతిభ ఉన్న దర్శకులను తన కాంపౌండ్ నుండి అంత సులువుగా బయటకి పంపడు దిల్ రాజు. అలాంటిది తన బ్యానర్ లో రెండు సినిమాలు చేసిన ఓ డైరెక్టర్, రైటర్ ని బయటకి పంపేసినట్లు తెలుస్తోంది.’నేను లోకల్’ తో దిల్ రాజు బ్యానర్ కి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు త్రినాధరావు నక్కిన, రైటర్ ప్రసన్న ఆ సినిమా తరువాత ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా తీశారు. ఈ సినిమాకి ఏవరేజ్ మార్కులే పడ్డాయి.

అయితే ఈ ఇద్దరూ కూడా తమ తదుపరి చిత్రానికి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో దిల్ రాజు బయట ప్రయత్నించుకోమని చెప్పేశారట.’హలో గురు ప్రేమకోసమే’ సినిమా గనుక హిట్ అయి ఉంటే దిల్ రాజు వీరి అడిగినంత ఇచ్చేవారేమో కానీ ఆ సినిమాకి ఏవరేజ్ టాక్ రావడం, నెక్స్ట్ సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వారిని దిల్ రాజు బయటకి పంపేశారట. ఇప్పుడు ఈ డైరెక్టర్, రైటర్ వెంకటేష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా పొందారని టాక్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -