Sunday, May 5, 2024
- Advertisement -

ఆ నిర్మాతలు తనపై దుష్ప్రచారం చేశారంటున్న దర్శకుడు!

- Advertisement -

దేవా కట్ట… వెన్నెల, ప్రస్థానం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడితను. ఆ తర్వాత మాత్రం “ఆటోనగర్ సూర్య” తో ఇతడి పరిస్థితి అడ్డం తిరిగింది.

నాగచైతన్య హీరోగా రూపొందించిన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మరి ఇన్నాళ్లకు ఆ దర్శకుడు మరో సినిమాతో వస్తున్నాడు. మంచు విష్ణు వర్ధన్ బాబు హీరోగా రూపొందిన “డైనమేట్”కు ఇతడే దర్శకుడు. ఆ సినిమా విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో దేవా కట్ట చెబుతున్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 వాటి సారాంశం ఏమనగా… తన గురించి.. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దేవా అన్నాడు. ఆటోనగర్ సూర్య సినిమా విషయంలో ఎక్కవు బడ్జెట్ అయ్యిందని ఆ బ్యానర్ వారు ప్రచారం చేశారని దేవా కట్ట అంటున్నాడు. ఆ సినిమాకు పది కోట్ల రూపాయల బడ్జెట్ అయితే… ఆ నిర్మాతలు ఏకంగా 25 కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యిందని ప్రకటించుకొన్నారని ఆ దర్శకుడు అంటున్నాడు. వాళ్లు తన గురించి దుష్ప్రచారం చేశారని.. తను నిర్మాతల దర్శకుడిని అని.. దేవా కట్టా చెప్పుకొన్నాడు.

ఆటోనగర్ సూర్య సినిమాకు ఎక్కువ బడ్జెట్ కావడానికి తాను బాధ్యుడిని కాదని వివరణ ఇచ్చుకొన్నాడు. మరి ఈ అంశం గురించి ఆర్ఆర్ మూవీ మేకర్స్ మాట్లాడుతుందా… దర్శకుడు చెప్పిన మాటలను ఖండిస్తూ ఏమైనా ప్రకటన చేస్తుందా? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -