పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను తీవ్రంగా అవమానించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
అదికూడా తమ అభిమాన హీరో పవన్ ను మరో హీరో మహేశ్ బాబుతో పోలుస్తూ వర్మ పవన్ అభిమానులను అవమానించాడు. ట్విటర్ లో ఫాలోయర్ల సంఖ్య విషయంలో మహేశ్ ముందున్నాడని.. పవన్ కల్యాణ్ కు ఆ స్థాయి లేకపోయిందని అంటూ.. వర్మ పవన్ అభిమానులను ఆల్ మోస్ట్ గా అవమానించాడు. ట్విటర్ లో మహేశ్ బాబుకు దాదాపు పదిహేను లక్షల మంది అభిమానులు ఉన్నారని.. అయితే పవన్ కు ఆ స్థాయిలో అభిమానులు లేరని వర్మ అంటున్నాడు.
మహేశ్ , పవన్ లు టాలీవుడ్ లో ఒకే రేంజ్ హీరోలు అనుకొంటే.. మహేశ్ కు మాత్రం అంత మంది అభిమానులు ఎలా ఎక్కువుంటారు? అని ఆర్జీవీ ప్రశ్నించాడు! బహుశా పవన్ కల్యాణ్ అభిమానులకు చదువు రాదేమో..వాళ్లకు సాంకేతికంగా అవగాహన లేదేమో.. వాళ్లకు కనీస అవగాహన లేకే.. పవన్ ట్విటర్ ఫాలోయర్ల సంఖ్య తక్కువగా ఉందేమో అని వర్మ వ్యాఖ్యానించాడు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా పవన్ కల్యాణ్ ట్విటర్ ఫాలోయర్ల విషయంలో మహశ్ ను అందుకునే అవకాశాలు లేవని వర్మ అభిప్రాయపడ్డాడు.
కేవలం ఇలా దుమ్మెత్తిపోయడమే కాదు.. లాజికల్ గా కూడా మహేశ్ బాబును హైలెట్ చేశాడు వర్మ. పవన్ ఇటీవలే ట్విటర్ ఖాతాను తెరిచిన విషయం వాస్తవమే అయినా.. మరీ ఇంత తేడా మాత్రం ఉండరాదన్నట్టుగా వర్మ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా.. వర్మ తాజా ట్వీటు పవన్ అభిమానులను అవమానించినట్టుగానే ఉంది. మరి దీనికి వారు ఏమని సమాధానం ఇస్తారో!