అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ “సరిలేరు నీకెవ్వరూ” లాంటి మాస్ హిట్ తరువాత ఎన్నో అంచనాలతో చేస్తున్న చిత్రం “సర్కారు వారి పాట “. వాస్తవానికి ఈ మూవీ లాక్ డౌన్ కి ముందు రావాల్సి ఉన్నా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే మొన్నటి వరకు దుబాయ్ లో జరిగింది. ఇప్పుడు ఇండియాకు వచ్చిన తర్వాత నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. మాఫియా తరహాలో సాగే ఈ మూవీలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. తా
జాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఇందులో మహేష్ అభిమానులు కోరుకుంటున్న ప్రతీ అంశంతో పాటు మాస్ కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు పరశురామ్. సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేశాడు మహేష్ బాబు. ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ చేశాడు.
మరోసారి శేఖర్ కొరియోగ్రఫీలో అదిరిపోయే డాన్స్ సాంగ్ ఉండబోతుంది. దీని కోసం తమన్ కూడా మాంచి బీట్ సాంగ్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ పాట రికార్డింగ్ కూడా అయిపోయింది. త్వరలో ఈ సాంగ్ షూటింగ్ జరుపుకోబోతున్నారట.
మహా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!