Sunday, April 28, 2024
- Advertisement -

క్రిష్ వేరే సినిమా చేస్తున్నాఆలోచనలన్నీ పవన్ మీదేనట..?

- Advertisement -

రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అందులో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న వకీల్ సాబ్ అనే సినిమా.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా వేణు ఆతర్వాత రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.. దాంతో కొంత టైం తీసుకుని బాలీవుడ్ లోని పింక్ సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే ఈ కథను పవన్ కళ్యాణ్ చేయడం విశేషం.. బాలీవుడ్ లో పింక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. అమితాబ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుభాషల్లో రిలీజ్ కాగ తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు..

తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే.. ఇక పవన్ కళ్యాణ్ రెండో సినిమా ని  క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు..

అయితే ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్న క్రిష్ కి మనసంతా పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఉందట. అతని బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తోందిట. ఈ చిత్రంలో హీరోయిన్లు.. ఇతర నటీనటుల గురించి చాలా ఊహాహాగానాలు వినిపించినా ఇంకా కొందరిని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక క్రిష్ కి పవన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తారు? అన్నదానికి సమాధానం వెతికితే.. పవర్ స్టార్  అక్టోబర్ 26 నుంచి వకీల్ సాబ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సేమ్ టైమ్ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రీకరణపైనా పవన్ ఆలోచిస్తున్నారు.

జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

విజయ్ కి త్రుటిలో జారిన రికార్డు..?

డబ్బులు లేక పెట్రోల్ బంక్ లో పని చేసిన రాజ్ తరుణ్..!

విజయ్ కోసం అనుష్క ప్రయత్నాలు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -