తెలుగు బిగ్బాస్ రెండో సీజన్పై ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పన్స్ వస్తుంది.న్యాచురల్ స్టార్ నాని మొదట్లో చెప్పినట్లుగానే బిగ్బాస్ హౌస్లో రోజు రోజుకి మరింత మసాలా యాడ్ చేస్తున్నారు.ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్లైన్తో వచ్చిన బిగ్బాస్ దానికి తగినట్లుగానే రెండో సీజన్ షో నడుస్తుంది.ఇక బిగ్బాస్ రెండో సీజన్పై చాలామంది సెలబ్రిటీలు సైతం స్పందించారు,స్పందిస్తున్నారు కూడా.ఇటీవల యాంకర్ రష్మి బిగ్బాస్ విజేత కౌశల్ కాకపోతే ధర్నాలు జరుగుతాయని కామెంట్స్ చేసింది. బిగ్బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్ అయిన హరితేజ ,జబర్ధస్త్ యాంకర్ అనసూయలు కూడా బిగ్బాస్ రెండో సీజన్పై స్పందించారు.రచయిత,నిర్మాత అయిన కోన వెంకట్ ఫేస్ బుక్ లైవ్ లో కౌశల్ ఆర్మీ గురించి మాట్లాడారు.
తాజాగా దర్శకుడు మారుతి సైతం కౌశల్కి సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.’బిగ్ బాస్ 2 తెలుగు లేటెస్ట్ ఎపిసోడ్ చూశాను. కౌశల్ ప్రెజెన్స్ చాలా ఆకట్టుకుంటోంది. కౌశల్ ఆర్మీ పేరుతో ఆయన చాలా ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం చూస్తుంటే బాగా అనిపిస్తోంది. ఈ సీజన్ విన్నర్ అతడే అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. ఇక కౌశల్కు రోజు రోజుకి మద్దతు భారీగా పెరుగుతుంది.సోషల్ మీడియాలో అతనికి ఫాలోయింగ్ సంగతి తెలిసిందే.దీంతో పలువురు సెలబ్రిటీలు కౌశల్కే మద్దతు తెలుపుతున్నారు.ఈ వారం నామినేషన్స్లో కూడా కౌశల్ ఉన్నాడు. మరి ఈ వారం కౌశల్ ఎలిమినేషన్ నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.