Wednesday, May 15, 2024
- Advertisement -

రాజ‌మౌళి కొడుకు ఎవ‌రిని పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా?

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బ‌హుబ‌లి సినిమా త‌రువాత ఇంట‌ర్‌నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించాడు.ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో క్రేజ్ కాంబినేష‌న్‌ను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డారు.ఎన్టీఆర్-రామ్ చ‌ర‌ణ్ మల్టీస్టార‌ర్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు రాజ‌మౌళి.ప్ర‌స్తుతం రాజ‌మౌళి త‌న కొడుకు కార్తికేయ పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నాడు.కార్తికేయ త‌న తండ్రి చిత్ర‌ల‌కు లైన్ ప్రొడ్యూసర్ గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పని చేస్తూ కొన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. కార్తికేయ గాయని పూజా ప్రసాద్‌తో గ‌త కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు.

ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించడంతో నిశ్చితార్ధం జరుపుకున్నారు.ఇంత‌కి ఈ పూజా ప్రసాద్ ఎవరా అనుకుంటున్నారా? న‌టుడు జగపతి బాబు అన్న రామ్ ప్రసాద్ కుమార్తె ఈ పూజా ప్రసాద్.ఇక వీరి నిశ్చితార్ధానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, అఖిల్ వంటి తారలు వీరి ఎంగేజ్మెంట్ లో సందడి చేశారు. త్వ‌ర‌లోనే పెళ్లి మూహార్తం డేట్‌ను కూడా ఫిక్స్ చేస్తార‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -