మిర్యాల గూడ పరువు హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా అమృత తండ్రి మారుతిరావు.. ప్రణయ్ ని హత్య చేయించారు. ఈ హత్యను ఇప్పటికే అన్ని రంగాల ప్రముఖులు స్పందించారు. తాజాగా వివాదాస్పద డైరెక్టర్ వర్మ స్పందించాడు.
ప్రణయ్ని హత్య చేయించిన మారుతీరావు ముమ్మాటికీ హంతకుడేనని అన్నారు. ఏ మాత్రం ధైర్యంలేని పిరికిపంద అని పేర్కొన్నారు. ‘అమృత తండ్రి మారుతీరావు క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్ ని హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువుకోసమే హత్య చేసినట్లయితే.. అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాలని ట్విట్టర్లో కామెంట్ చేశారు.
Amrutha’s father Maruti Rao is just a plain cowardly dirty criminal and getting Pranay killed is nothing to do with his honour ..if it’s a honour killing he should be ready to die ..
Real honour killing will be to kill all those who will kill for honour— Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2018