హీరోయిన్ దిశా పటానీ గుర్తుందా? ఆమె తెలుగులో చేసింది ఒక్క సినిమానే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా లోఫర్. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది దిశా పటానీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో,ఆమెకు తెలుగులో మరో అవకాశం రాలేదు. కాని బాలీవుడ్లో మాత్రం దూసుకుపోతుంది.బాలీవుడ్లో వరస సినిమాలు చేస్తు బిజీగా ఉంది. ఎంతలా అంటే ప్రభాస్ సాహో సినిమాలో హీరోయిన్గా నటించడానికి డేట్స్ ఖాళీ లేనంతగా దిశా పటానీ సినిమాలు చేస్తుంది. దీంతో మరో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ను సాహో సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు.
ఇక ఆమె పారితోషకం కూడా 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుందని టాక్. దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోస్తో పాటు. తన సినిమా విషయాలను కూడా తెలియజేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె ఓ షోటోని తన ఇన్స్టాగ్రమ్లో ఓ స్పైసీ పిక్ని ఆప్లోడ్ చేసింది. ఈ ఫోటోలో దిశా పటానీ తోడలు చూపిస్తు కుర్రకారుని రెచ్చగొడుతుంది. ఆమెను చూస్తుంటే మతి పోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.