అందాల భరిణెలాంటి రూపం సావిత్రిగారిది. ఆమె మహానటిగా కీర్తి గడించారు. అదే మహానటి పేరు మీద నాగ్ అశ్విన్ సినిమా తీస్తున్నారు. సావిత్రి జీవిత చరిత్రపై రూపొందుతున్న ఈ సినిమాలో ఒక్కో పాత్రను ప్రముఖ నటీనటులు పోషిస్తున్నారు. సమంత, కీర్తి సురేశ్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్బాబు, శాలినీ పాండే తదితరులు వివిధ పాత్రల్లో చేస్తున్నారు.
అయితే సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా సావిత్రి తల్లి పాత్రలో అలనాటి హీరోయిన్ నటిస్తోందంట. ఆమె ఎవరో కాదు బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం హీరోయిన్ దివ్యవాణి. పెళ్లి పుస్తకం తర్వాత టీవీ సీరియళ్లలోనే ఎక్కువగా కనిపించారు. ఆమె మళ్లీ సినిమా తెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారట. తొలిసారి కెరీర్లో హీరోయిన్ తల్లి పాత్రలో కనిపించనున్నారు. మహానటి సినిమాలో హీరోయిన్ కీర్తి సురేశ్కు తల్లిగా నటిస్తోంది. అంటే నిజజీవితంలో సావిత్రి తల్లి పాత్రను దివ్యవాణి సినిమాలో చేస్తోంది.
తన కుమార్తె చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దివ్యవాణికి ఈ ఆఫర్ వచ్చింది. దీంతో వెంటనే నటించడానికి ఓకే చెప్పారంట. నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలు దొరికితే సినిమాల్లో నటించేందుకు సిద్ధమని ఆమె చెబుతోంది.