- Advertisement -
దీపావళి పర్వదినం నాడు మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకచోట చేరారు. పండగను వైభవంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను చెర్రీ భార్య ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకోగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్ దేవ్, వరుణ్ తేజ్, నాగబాబు, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఒకే చోటకు చేరారు. వారి వారి సతీమణులు కూడా ఈ వేడుకలో భాగస్వామ్యం అయ్యారు.
సురేఖ, శ్రీజ, ఉపాసన, నీహారిక, స్నేహారెడ్డి తదితరులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. ఆ ఫోటోలు మీరూ చూడవచ్చు.అయితే ఈ ఫోటోలలో పవన్ లేకపోవడంపై ఆయన ఫాన్స్ చిరుని ప్రశ్నిస్తున్నారు.అయితే పవన్ రాజకీయలలో బిజీగా ఉండటం వల్లే ఈ ఫంక్షన్కు వెళ్లలేదని ఆయన సన్నిహితులు తెలిపారు.