తెలుగు తెరపై నటించిన చిత్రాలు రెండే అయినా.. బాలీవుడ్ భామ కైరా అద్వానికి మంచి క్రేజ్ వచ్చింది. వాస్తవానికి ఈ బ్యూటీ సుశాంత్ సింగ్ రాజ్ పూత్ నటించిన ఎంఎస్ ధోని చిత్రంలో నటించింది. ఈ చిత్రం కైరా అద్వానికి మంచి పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగు లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. బాలీవుడ్ లో ఆ మద్య సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు హాట్ ఫోటోలు తెగ హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా అందమైన శృంగార అనుభూతి కంటే తనకు పిజ్జాయే చాలా ఉత్తమమైనదని బాలీవుడ్ భామ కైరా అద్వానీ చిలిపి సమాధానం చెప్పారు.ట్వింకిల్ ఖన్నా ఆనలైన్ వెంచర్ ట్వీక్ ఇండియా కోసం చేసిన ఓ వీడియోలో ఆమె పలు ప్రశ్నలకు తొణకకుండా బెణకకుండా సమాధానాలు చెప్పి షాక్ ఇచ్చింది.
శృంగారం కంటే ఉత్తమమైన మూడు అంశాలు ఏవో చెప్పమంటే.. అమేజింగ్ పిజ్జా, షాపింగ్, ఒక మంచి సినిమా అంటూ ముందుగా పిజ్జా అంటూ సింపుల్ గా సమాధానం చెప్పింది. తనకు అత్యంత గొప్ప చీర్లీడర్స్ తన తల్లిదండ్రులే అని.. కాలేజ్ చేస్తున్న సమయంలో ఎంజాయ్ మెంట్ టూర్ లో తనకు తృటిలో ప్రమాదం తప్పిందని, చావును చాలా దగ్గరి నుంచి చూశానని కైరా చెప్పారు. తన కళ్లు అంటే తనకు ఎంతో ఇష్టమని అవే తన ఆయుధం అని చెప్పారు.
త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?
కాజల్ కోసం పడిగాపులు కాస్తున్న చిరు..?