Saturday, April 20, 2024
- Advertisement -

మళ్లీ డ్ర‌గ్స్ కేసు: ఇద్ద‌రు హీరోలు,ఓ ద‌ర్శ‌కుడు

- Advertisement -

టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన డ్ర‌గ్స్ కేసు మ‌ళ్ళీ తెర‌పైకి వ‌చ్చింది. దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన నార్కొటిక్ కేసు ఒకింత గ్యాప్ తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇండస్ట్రీలో కలకలం రేపిన ఈ కథ కంచికి చేరినట్లే అనుకున్నారు అంతా కాని మళ్లీ డ్రగ్స్ కేసులో సిట్ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు పై అభియోగాలు నమోదైనట్లు తెలుస్తుంది.

ఇందులో ఇద్ద‌రు హీరోలు కాగ మ‌రో వ్య‌క్తి ద‌ర్శ‌కుడని తెలుస్తుంది. ఈ కేసులో మరికొందరి ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉందని తెలుస్తుంది.కొందరు సినీ ప్రముఖులు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని పరువు తీయడం సరైంది కాదని ప్రభుత్వంతో విన్నవించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంత‌కీ ఆ ఛార్జ్‌షీట్‌లో ఉన్న ముగ్గురు ఎవ‌రు అనే ప్ర‌శ్న అంద‌రిలోఉంత్క‌ఠ‌ను రేపుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -