- Advertisement -
ఈషా రెబ్బా హీరోయిన్గా నాలుగైదు సినిమాలు చేసినప్పటికి ఆమెకు కాలం కలిసి రాలేదు.ఇంద్రగంటి మోహన కృష్ణతో అమీతుమీ సినిమాతో తొలి హిట్ అందుకుంది. ఈ సినిమా తరువాత ఈషా రెబ్బాకు వరస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఆమె తాజా చిత్రంగా వచ్చే నెల 3వ తేదీన ‘బ్రాండ్ బాబు ‘ రానుంది.ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్గా ఈషా రెబ్బాను తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా ఈషా మరో సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయిందని తెలుస్తుంది. రాజా అనే దర్శకుడు నాగశౌర్య హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బా ను తీసుకున్నారట. ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందనీ .. ఆమె మరింత బిజీ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.