- Advertisement -
ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారుపై నిరసనకారులు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. అసలు విషయానికి వస్తే 2015లో స్త్రీల మానం గురించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కుష్బూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సేలంకు చెందిన పాట్టాలి మక్కల్ కట్చి తరఫు న్యాయవాది మురుగన్ మేటూర్ కోర్టులో కుష్బూపై పిటీషన్ దాఖలు చేశారు
కేసు విచారణకు గాను ఆమె తమిళనాడులోని మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కారుపై దాడి జరిగింది. విచారణ సమయంలో ఖుష్బూను మేజిస్ట్రేట్ కొన్ని ప్రశ్నలు వేశారు. ఆమె చెప్పిన సమాధానాలను విన్న తర్వాత తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేశారు.