సమ్మర్లో ఎవరైన బీచ్లో హాయిగా గడుపడానికి ఇష్టపడుతుంటారు. అదే సెలబ్రిటీలు అయితే వేరే దేశాలకు అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. సమ్మర్లో హీరోయిన్గా ఎంజాయ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హీరోయిన్లు సమ్మర్ను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. షూటింగ్లకు గ్యాప్ ఇచ్చి మరి సముద్రంలో సెద తీరుతుంటారు. తాజాగా ఇలాంటి పనే చేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డె. సముద్రనికి తన అందాలను ఎర వేసినట్లు ఫోజులిచ్చింది ఈ భామ.
ఈ లుక్ లో రెడ్ కలర్ పర్పుల్ టాప్ తో మైమరిపిస్తోంది. బికినితో పూజా తన అందాలను బయటపెట్టింది. ఇసుక రేణువుల మధ్య పూజి హెగ్డె అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. పూజా హెగ్డె ఇలా అందాలు ప్రదర్శించడంపై ఆమె డైహార్డ్ ఫ్యాన్ ఒకరు స్పందించారు. ప్లీజ్ పూజా నేను మీకు డైహార్టెడ్ ఫ్యాన్ ని. అలా ఎక్స్ పోజ్ చేయకండి! అంటూ వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. మరి దీనిపై పూజా హెగ్డె ఎలా స్పందిస్తుందో చూడాలి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది పూజా హెగ్డె. బన్నితో కలిసి నటించిన దువ్వాడ జగన్నాథ్ సినిమాతో హిట్ను తన ఖాతాలో వేసుకుంది.
ఆ తరువాత కుర్ర హీరోలతో నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. మళ్లీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమాతో మరో హిట్ను కొట్టింది. మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా పూజా హెగ్డెనే హీరోయిన్. ప్రభాస్ కొత్త సినిమాతో పాటు, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో పూజా హెగ్డెనే హీరోయిన్గా నటిస్తుంది. వీటిల్లో రెండు సినిమాలు బ్లాక్ బ్లాస్టర్లుగా నిలిచిన పూజా హెగ్డె స్టార్డమ్ మరింత పెరగడం ఖాయం.